AP:గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

by Jakkula Mamatha |   ( Updated:2024-10-17 15:22:44.0  )
AP:గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
X

దిశ ప్రతినిధి,చిత్తూరు: చిత్తూరు పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చిత్తూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ 2.50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వారి వద్ద ఉండిన మారానాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశారు. చిత్తూరు టూ టౌన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు సీఐ నెట్టి కుంటయ్య ఎస్సై ప్రసాద్ మరియు సిబ్బంది కలిసి చిత్తూరు పట్టణంలోని ఇరువారం ఏరియాలో గంజాయి అక్రమ అమ్మకాల పై నిఘా పెట్టారు. దీంతో బుధవారం మధ్యాహ్నం ఇరువారం లోని ఇండియన్ గ్యాస్ గోడౌన్ వెనుక వైపు దాడులు నిర్వహించి సెల్వం, ఝాషువ, లోకేష్ లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.600 కేజీల గంజాయితో పాటు ఒక మోటార్ సైకిల్, రెండు ఆటోలు మరియు వారి వద్ద ఉన్న 5 పొడవాటి కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story