ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం

by Jakkula Mamatha |
ప్రమాదవశాత్తు కాలువలో గల్లంతైన మహిళ మృతదేహం లభ్యం
X

దిశ, పాణ్యం:పాణ్యం మండల కేంద్రమైన చందమామ హోటల్ సమీపంలోని SRBC కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారి వెన్నెల(20) అనే మహిళ మృతి చెందినట్లు పాణ్యం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 13వ తేదీన గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన వెన్నెల అనే మహిళా SRBC కాలువ నందు దిగి కాలుజారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత మూడు రోజుల నుంచి పోలీస్ మరియు మృతురాలి బంధువులు, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్లు సహాయంతో బుధవారం బనగానపల్లె మండల కేంద్రంలోని రవ్వలకొండ నందు గల SRBC కాలువలో ఆమె మృతదేహం కనుగొనడం జరిగింది. కాలువలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి అనంతరం వెన్నెల మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరైనా చేపలు పట్టుటకు, ఈతకు వెళ్లడం చేయరాదన్నారు.

Advertisement

Next Story

Most Viewed