ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు..

by Sumithra |
ట్యాంకర్ ను ఢీ కొట్టిన బస్సు..
X

దిశ, నకిరేకల్ : హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై నార్కట్ పల్లి శివారులో ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాదు నుంచి కోదాడకు వెళుతుంది. రోడ్డు పక్కన చెట్లకు నీరు పోస్తున్న ట్యాంకర్ ను బస్సు ఢీ కొట్టడంతో 15మందికి గాయాలయ్యాయి.

వెంటనే స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో జాతీయ రహదారి పై ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలను తరలించారు.

Advertisement

Next Story

Most Viewed