- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG High Court: బెట్టింగ్ యాప్స్ కేసులో ట్విస్ట్.. హైకోర్టులో యాంకర్ శ్యామల క్వాష్ పిటిషన్

X
దిశ, వెబ్డెస్క్: బెట్టింగ్ యాప్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీసుల నోటీసులు అందుకున్న వైసీపీ నేత, ప్రముఖ యాంకర్ శ్యామల ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె పిటిషన్ ఇవాళ మధ్యాహ్నం ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నట్లుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. మియాపూర్కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్ఐఆర్ నెం.393/2025 కింద 318 (4) 112, రెడ్ విత్ 49 బీఎన్ ఎస్ 3, 3(ఏ) 4, టీఎస్ జీఏ,66-డి ఐటీఏ 2000-2008 సెక్షన్లతో కేసులు బుక్ చేశారు. అదేవిధంగా విచారణకు రావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు.
నోటీసులు అందుకున్న వాళ్లలో దగ్గుబాటి రాణా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాత్, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర రాజన్, వాసంతి కృష్ణన్, శోభశెట్టి, అమృత చౌదరి, నాయని పావని, నేహ పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, బయ్యా సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషాయనీ సుప్రీత ఉన్నారు.
Next Story