Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. 10 మంది విద్యార్థులకు గాయాలు

by Shiva |
Road Accident: కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. 10 మంది విద్యార్థులకు గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన మిర్యాలగూడెం (Miryalagudem) మండల పరిధిలోని అవంతిపురం (Avanthipuram)లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తుండగా బస్సు అతివేగంతో అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన చిన్నారులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రి (Miryalagudem Government Hospital)కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story

Most Viewed