అలుగు దాటుతుండగా జారిపడి యువకుడు మృతి

by Sridhar Babu |
అలుగు దాటుతుండగా జారిపడి యువకుడు మృతి
X

దిశ, మోమిన్ పేట్ : చెరువు అలుగు దాటుతుండగా జారి నీటిలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మోమిన్పేట్ పరిధిలోని టేకులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మోమిన్పేట్ ఎస్ఐ అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మంగళవారం మోమిన్పేట్ మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మన్నె రాములు (53) పని కోసం వెళ్తూ చెరువు అలుగు దాటుతుండగా జారి నీళ్లలో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి భార్య మన్నె లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story