అమ్మవారి దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..

by Sumithra |
అమ్మవారి దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..
X

దిశ, కౌడిపల్లి : తునికి నల్లపోచమ్మ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే మెదక్ మండలం ఫరీద్ పూర్ గ్రామానికి చెందిన జక్కుల యాదగిరి (45), జక్కుల యాదమ్మ(40) దంపతులు టీవీఎస్ ఎక్సెల్ పై తునికి గ్రామ శివారులోని శ్రీ నల్లపోచమ్మ దర్శనానికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో కౌడిపల్లి మండలం అంతారం గేట్ సమీపంలోని మూలమలుపు దాటిన తర్వాత నర్సాపూర్ వైపు నుంచి వస్తున్న ట్రాలీ ఆటో (TS08UH 7319) టీవీఎస్ ఎక్సెల్(TS35 0418) బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మోపెడుపై ఉన్న దంపతులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే కౌడిపల్లి ఎస్సై శివ ప్రసాద్ రెడ్డి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story