పొలంలో భార్యను కొట్టి చంపిన భర్త

by  |
పొలంలో భార్యను కొట్టి చంపిన భర్త
X

దిశ, కామారెడ్డి: కలకలాలం కలిసి ఉంటానని చెప్పి అగ్ని సాక్షిగా మూడు ముళ్లు వేసినోడే ఆ వివాహితను కాటికి పంపిండు. కలహాల వస్తాయి పోతాయన్నది మరిచి భార్య దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం పెద్దారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్య దుర్గవ్వ(40)ను పొలం వద్ద పారతో భర్త రామాకిష్టయ్య కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన దుర్గవ్వను స్థానికులు ఎల్లారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story