దేశంలో కేసులు తగ్గుతున్నాయ్ : లవ్ అగర్వాల్

by vinod kumar |
దేశంలో కేసులు తగ్గుతున్నాయ్ : లవ్ అగర్వాల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రతీరోజు చేస్తున్న టెస్టుల సంఖ్య పెరిగిందని వివరించారు. ప్రస్తుతం దేశంలో 31లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. కేవలం ఐదు రాష్ట్రాల్లోనే 50శాతం మరణాలు సంభవిస్తున్నాయని లవ్ అగర్వాల్ స్పష్టంచేశారు. వ్యాక్సిన్ కొరత ఉన్నందున డోసులు వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. ఒక్క వ్యాక్సిన్ నిరుపయోగమైనా ఒక ప్రాణం రిస్క్‌లో పడుతుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed