కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్

by Anukaran |
కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులను హడలెత్తిస్తోంది. చాలా మంది ప్రముఖులు వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇప్పటికే కరోనా సోకగా.. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు కూడా పాజిటివ్ గా తేలింది.

ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే, లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేసుకుంటే పాజిటివ్‌గా తేలిందన్నారు. అయితే, గత కొద్ది రోజులుగా తనను సంప్రదించిన వారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా గజేంద్ర షేకావత్ సూచించారు. ప్రస్తుతం ఆయన గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Advertisement

Next Story