ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్

by vinod kumar |
ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్
X

దిశ, హుజూర్‎నగర్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మండల వైద్యాధికారి రమ్య తెలిపారు. ఈ నేపథ్యంలోనే కరోనా బాధితులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా సూర్యాపేటలోని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్లు ఆమె వివరణ ఇచ్చారు. అలాగే, ప్రైమరీ కాంటాక్టు ఉన్నవారిపై కూడా ఆరా తీస్తున్నామన్నారు. రేపు వైద్య సిబ్బందితో సర్వే చేయించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed