ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్

by vinod kumar |   ( Updated:2021-04-16 02:23:30.0  )
MP Malothu kavitha
X

దిశ, మహబూబాబాద్: రాష్ట్రంలో మహమ్మారి భయంకరంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ కరోనా ఎవరినీ వదలడం లేదు. తాజాగా టీఆర్ఎస్ కీలక నేత, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు సమచారం. అంతేగాకుండా.. ఇటీవల తనను కలిసి వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆమె కోరారు.

Advertisement

Next Story

Most Viewed