నిన్న పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్

by  |
నిన్న పుట్టిన శిశువుకు కరోనా పాజిటివ్
X

దిశ, నిజామాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుందంటే.. అప్పుడే పుట్టిన పాప నుంచి పండు ముసలి వరకూ ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఒక్కరోజు వయస్సు ఉన్న నవజాత శిశువుకు సోకింది. ఆదివారం కామారెడ్డి జిల్లాలో ఓ గర్భిణి మహిళకు పాజిటివ్ వచ్చింది. ఆమె ద్వారా అప్పుడే పుట్టిన పుట్టిన ఒకరోజు వయస్సు గల మగ శిశువులో వైరస్‌ను గుర్తించినట్టు కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నుంచి 42 షాంపిల్స్ పంపగా 38 నెగిటివ్ రాగా కామారెడ్డి పట్టణంలోని ఎన్‌జీఓ కాలనీలో 1, జంగంపల్లి గ్రామంలో 1, బిక్నూర్ 1, రాజంపేట్‌లకు చెందిన వారు వైరస్ బారిన పడ్డారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 118కి చేరాయి. యాక్టివ్ కేసులన్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మిగిలిన వారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


Next Story

Most Viewed