చెత్త వాహనంలో కరోనా రోగి.. చంద్రబాబు ఫైర్

by Anukaran |
చెత్త వాహనంలో కరోనా రోగి.. చంద్రబాబు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఇటు ప్రభుత్వం మండిపడుతూనే అటు ప్రజలకు పలు సూచనలు చేశారు. విషయమేమంటే.. పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా రోగిని చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్లడం దారుణమన్నారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు తమ ధైర్యం కోల్పోవొద్దని భరోసా ఇచ్చారు. ప్రజలు ఎవరికివారే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి పెంచుకోవాలని, మద్యపానం, ఇతర చెడు అలవాట్లు మానేయాలని సూచించారు. హోం క్వారంటైన్, టెలీ మెడిసిన్‍పై ప్రభుత్వం మరింత అవగాహన పెంచాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed