ఇండియా కరోనా బులెటిన్ రిలీజ్

by  |
ఇండియా కరోనా బులెటిన్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లో 78,512 కొత్త కేసులు నమోదయ్యాయి. 971 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 36 లక్షల 21,245కి చేరింది. ఇందులో 27 లక్షల 74,801 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 7 లక్షల 81,975 మంది బాధితులు కరోనాతో ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 64,469 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో 8.46 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా ఇప్పటివరకు మొత్తం 4.23 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.


Next Story

Most Viewed