ఆ సీక్వేల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ పోస్ట్

by Kavitha |   ( Updated:2024-08-31 14:16:17.0  )
ఆ సీక్వేల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీసింహ హీరోగా రితేశ్ రానా రూపొందిస్తున్న చిత్రం ‘మత్తు వదలరా 2’. ఇదే కాంబినేషన్‌లో గతంలో ‘మత్తు వదలరా’ అనే మూవీ తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. అయితే నిన్న ఆ సినిమా టీజర్ లాంచ్ అయింది. తాజాగా దీనిపై దర్శక ధీరుడు రాజమౌళి ఈ సీక్వెల్ టీజర్‌పై స్పందిస్తూ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

ఆ పోస్ట్‌లో భాగంగా.. “నా బాయ్స్ మత్తు వదలరా 2తో వస్తున్నారు. టీజర్‌లోని డైలాగ్స్ సూపర్. మంచి ఫన్ పంచాయి. విజువల్స్ అద్భుతం. ఈ సీక్వెల్ పై అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 13న టికెట్లు తస్కరించేందుకు (టీజర్‌లోని సంభాషణను ఉద్దేశిస్తూ) అంతా సిద్ధం అని పేర్కొన్నారు. అలాగే టీజర్‌లోని మరో డైలాగ్‌ను గుర్తు చేస్తూ హీ.. హీ.. హీ.. హీ.. టీమ్” అంటూ స్మైలీ ఎమోజీలు యాడ్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదల కానుంది.


Advertisement

Next Story

Most Viewed