ఏపీలో అణువిద్యుత్ కేంద్రం 

by  |
ఏపీలో అణువిద్యుత్ కేంద్రం 
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో (westinghouse electric company) చర్చిస్తున్నట్లు వెల్లడించింది.

1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం వివరించింది.



Next Story