బాంబు పేలుళ్లు, 8మంది మృతి

by Sumithra |
బాంబు పేలుళ్లు, 8మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అప్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో ఆదివారం బాంబు పేలుళ్లలో 8మంది చనిపోయారు. 20మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాబుల్ పశ్చిమ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుళ్లను ఆత్మాహుతిదాడిగా అనుమానిస్తున్నారు.

Advertisement
Next Story

Most Viewed