బిగ్‌బాస్ చరిత్రలోనే ఫస్ట్‌ టైమ్.. వరుసగా నలుగురు కంటెస్టెంట్లు ఔట్?

by Hamsa |
బిగ్‌బాస్ చరిత్రలోనే ఫస్ట్‌ టైమ్.. వరుసగా నలుగురు కంటెస్టెంట్లు ఔట్?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఈ షో స్టార్ట్ అయి దాదాపు నాలుగు వారాలు పూర్తి అయింది. ఇదిలా ఉంటే.. ఈ సారి బిగ్‌బాస్ చరిత్రలోనే ఇలా జరగడం మొట్టమొదటిసారి. వరుసగా నాలుగు వారాలు మహిళా కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మొదటి వారం కిరణ్ రాధోడ్.. తెలుగు రాకపోవడం వల్ల ఆమె ఎక్కువ రోజులు ఇంట్లో ఉండలేదు. ఎంటర్‌టైన్మెంట్ కూడా అనుకున్నంత స్థాయిలో ఇవ్వలేదు.

ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన రెండో కంటెస్టెంట్ షకీలా. ప్రేక్షకులు ఊహించనంత వినోదం ఇవ్వలేక పోవడంతో ఓట్లు తగ్గిపోయాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మూడో కంటెస్టెంట్ దామిని. బయట సింగర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ హౌస్‌లో మాత్రం వంట రూమ్‌కే అంకితం అయింది. మిగతా విషయాల గురించి పట్టించుకోలేదు. రతిక మొదట పల్లవి ప్రశాంత్‌తో చనువుగా ఉంది. ఈ తర్వాత గొడవ కావడంతో యావర్‌తో ఉంది. ఇక నాలుగో వారం రతిక రోస్ ఊహించని విధంగా బయటకు వచ్చేసింది. ఇది ప్రేక్షకులు ఇచ్చిన తీర్పే. అయినా వారు ఆడిన ఆట ఆధారంగానే.. నాగార్జున వచ్చి ఎలిమినేట్ చేస్తారు. కానీ నలుగురు మహిళా కంటెస్టెంట్లు వరుసగా బయటకు వెళ్లడం మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed