Bigg Boss-7: సెలబ్రెటీలను కూడా వెనక్కి నెట్టి.. మొదటి కెప్టెన్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్

by Hamsa |
Bigg Boss-7: సెలబ్రెటీలను కూడా వెనక్కి నెట్టి.. మొదటి కెప్టెన్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్-7 శుక్రవారం ఎపిసోడ్ చిట్టి అయిరే అనే టాస్క్‌తో స్టార్ట్ అయింది. సందీప్, అమర్‌లను పిలవగా వారి కుటుంబ సభ్యులను తలుచుకుని ఇద్దరు ఏడ్చారు. అమర్ త్యాగం వల్ల సందీప్ ఇంటి నుంచి వచ్చిన లెటర్ పొందుతాడు. అలాగే ప్రశాంత్ విషయంలో శివాజీ త్యాగం చేశాడు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ మొదలవుతుంది. అందులో చివరిగా తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ రేసులో ఉంటారు. ఓ సర్కిల్‌లో అందరూ నిలబడి ఒకరు మరొకరి టీ షర్ట్‌పై చేతులతో రంగు పూయాలి. ఎండ్ బజార్ మోగేలోపు ఎవరి టీ షర్ట్‌పై ఎక్కువ కలర్ ఉంటే వారు ఎలిమినేట్ అయినట్టు అని బిగ్‌బాస్ చెబుతాడు. ఇక ఇందులో చివరికి వచ్చేసరికి గౌతమ్, ప్రశాంత్ ఉంటారు. ఫైనల్ రౌండ్‌లో గౌతమ్-ప్రశాంత్ ఒకరిపై ఒకరు పోటిపడి మరీ కలర్స్ పూసుకుంటారు. టాస్క్ పూర్తయ్యు సరికి గౌతమ్ టీషర్ట్‌పై ఎక్కువ రంగు ఉండటంతో ప్రశాంత్ విన్ అవుతాడు. దీంతో సీరియల్ బ్యాచ్‌నంతా వెన్కి నెట్టి ఐదో సీజన్ మొట్టమొదటి కెప్టెన్‌గా ఎంపికవుతాడు. బిగ్‌బాస్ అతడికి బ్యాడ్జి కూడా పంపుతారు. ఆ తర్వాత అమర్ దీప్ అరుస్తాడు.

Advertisement

Next Story

Most Viewed