తేనెటీగల దాడిలో ఒకరి మృతి 

by Shyam |
తేనెటీగల దాడిలో ఒకరి మృతి 
X

దిశ, మహబూబ్ నగర్
తేనెటీగలు దాడి చేయడంతో ఓవ్యక్తి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్లబురుజులో 8 మందిపై తేనెటీగలు దాడి చేయటంతో అందులో కథాలప్ప(44) అనే వ్యక్తి మృతి చెందగా, ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్ననాగరాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. బాధిత బాలున్నిజిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తేనెటీగల దాడిలో మరికొంత మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
tags; Attack of the bees, ones death, mahabubnagar

Advertisement

Next Story

Most Viewed