పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి

by Shyam |
పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలి
X

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కోరారు. 80 ఏండ్లు దాటిన వృద్దులు, దివ్యాంగులు, కరోనా పాజిటివ్ వచ్చిన వారు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. www.tsec.gov.in వెబ్ సైట్‌లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌ను ఆర్వోలు చిరునామాలకు పంపిస్తారని అన్నారు.

Next Story