మరో బాలికపై అత్యాచారం @ అనాథాశ్రమం

by  |
మరో బాలికపై అత్యాచారం @ అనాథాశ్రమం
X

దిశ, వెబ్ డెస్క్: అమీన్ పూర్ అనాథ ఆశ్రమంలో ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మరో బాలికపై కూడా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ అనాథ ఆశ్రమంలో ఉండే బాలిక ఏడాదిగా అత్యాచారానికి గురై బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. తనలాగే మరో బాలికపై కూడా నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు తనకు మృతిచెందిన బాలిక చెప్పినట్లు బాలిక పిన్ని వెల్లడించింది. నిందితుడు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో ఆ బాలిక సైతం తీవ్ర అస్వస్థకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయను అడిగారని, కానీ వారిని విజయ బెదిరించడంతో వారు ఆ బాలికను తీసుకొని వెళ్లారని బాలిక వివరించించిందని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

కాగా, ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి.. మృతిచెందిన బాలికపై ఏడాది నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఇందుకోసం అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జయదీప్ అతడికి సహకరించిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed