Idupulapaya: వైఎస్సార్‌కు వైఎస్ షర్మిల నివాళులు

by srinivas |
Idupulapaya: వైఎస్సార్‌కు వైఎస్ షర్మిల నివాళులు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌‌కు వైఎస్ షర్మిల నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు కొనియాడారు. వైఎస్‌తో తమకున్న అనుబంధాన్ని, పార్టీకి ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. వైఎస్ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నామని షర్మిల తెలిపారు. వైఎస్ ప్రేమించిన, జీవించిన కాంగ్రెస్ పార్టీకి నిజమైన కార్యకర్తగా పని చేస్తానని వైఎస్ షర్మిల చెప్పారు.

Advertisement

Next Story