AP Politcs: నేటితో పప్పు పులకేశి ముసుగు తొలిగిపోతుంది.. వైసీపీ ట్వీట్‌పై ఉత్కంఠ..

by Disha Web Desk 3 |
AP Politcs: నేటితో పప్పు పులకేశి ముసుగు తొలిగిపోతుంది.. వైసీపీ ట్వీట్‌పై ఉత్కంఠ..
X

దిశ వెబ్ డెస్క్: రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అధికార పార్టీకి ప్రతిపక్షమైన టీడీపీకి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ఇరు పార్టీలు అటు బహిరంగ సభల్లోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఒకరిపై మరొకరు విమర్శల అస్త్రాలను సంధించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తాజాగా వైసీపీ ట్విట్టర్ లో (X) వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి ఓ పోస్ట్ చేసింది.

ఈ రోజు పప్పు పులకేశి అబద్దాల గురించి చెప్పబోతున్నాం.. నేటితో అతని ముసుగు తొలిగిపోతుందని, ఈ రోజు లోకేష్ నిజస్వరూపం గురించి ప్రజలు తెలుసుకుంటారని ట్వీట్‌లో రాసుకొచ్చింది. దీనితో అటు రాజకీయవర్గాల్లోనూ ఇటు ప్రజలల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

Next Story