2.45లక్షల టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

by Seetharam |
sambasiva rao
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోంది అని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 25 వేల ఓట్లు తొలగించేందుకు కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టయిన వారం రోజుల్లో కుట్ర ప్రారంభించారు అని ఏలూరి ఆరోపించారు. 2.45 లక్షల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7 అప్‍లోడ్ చేశారు అని చెప్పుకొచ్చారు. కొత్త ఓట్ల చేరికలకు 1.20 లక్షలు ఫామ్‍ 6 పెట్టారు అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వెల్లడించారు. ఫేక్ సిమ్‍కార్డ్ రాకెట్‍పై సమగ్ర విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. కొందరు ఎన్నికల అధికారులు అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు అని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడినవారిపై తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. పర్చూరులో అధికారులకు వీఆర్‌తో సరిపెట్టారన్నారు. 189 మంది కుట్రకు పాల్పడితే 12 మందిపైనే చర్యలు తీసుకున్నారని అన్నారు. అధికారులపై చర్యలు తీసుకునేవరకూ విడిచిపెట్టం అని టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed