వాలంటీర్లు యుద్ధం చేస్తే మీరు పబ్జీ ఆడుతారా?.. జగన్ పైబీజేపీ సెటైర్

by Prasad Jukanti |
వాలంటీర్లు యుద్ధం చేస్తే మీరు పబ్జీ ఆడుతారా?.. జగన్ పైబీజేపీ సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయం రంజుగా సాగుతోంది. సిద్ధం అంటూ వైసీపీ క్యాంపెయినింగ్ చేస్తుంటే దానికి ప్రతిపక్షాలు కౌంటర్లు వేస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ పై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సెటైర్లు వేశారు. 'సిద్ధం' అంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికి ఇప్పుడు మీరే 'యుద్ధం' చేయాలని వాలంటీర్లను పురిగొల్పడం ద్వారా సీఎం వైఎస్ జగన్ చేతులెత్తేశారని సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. వాలంటీర్లు యుద్ధం చేస్తే మీరు పబ్జి ఆడుకుంటారా? అని ప్రశ్నించారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాలంటీర్ల పేరుతో ముష్టి ఐదు వేలు విదిలిస్తూ ఎంతో విలువైన వారి ఐదేళ్ల కాలాన్ని వృధా చేశారని మండిపడ్డారు. చాకిరీ చేయిస్తూ, అవమానాలకు గురి చేస్తూ, ప్రజలలో చులకన చేసిన వారి భవిష్యత్తును నాశనం చేశారని, అందువల్ల అవినీతి అరాచక వైసీపీ పార్టీని కూకటి వేళ్లతో పెకలించే ఒక 'నిశబ్ధ తుఫాను'లో వాలంటీర్లు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వానికి దెబ్బకు దెబ్బ కొట్టాలన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed