విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని భర్త ఆరోపణలు.. భార్య క్లారిటీ

by srinivas |
విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని భర్త ఆరోపణలు.. భార్య క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: తాను విదేశాల్లో ఉంటున్నానని, ఓ రాజకీయ నాయకుడు, ప్రభుత్వ ప్లీడర్ సుభాష్ వల్ల తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌పై భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మదన్ మోహన్ చేసిన ఆరోపణలపై లేడీ కమిషనర్ స్పందించారు. మదన్ మోహన్‌తో తనకు 2013లో పెళ్లి అయిందని, ఆ సమయంలో ఆమె ‘లా‘ చదువుతోందని తెలిపారు. 2010-15 మధ్య తాను ‘లా’ చదివినట్లు చెప్పారు. భర్త మదన్ తనను చాలా హింసించాడని తెలిపారు. ‘‘2016లో విడాకులు తీసుకున్నాం. 2021 వరకూ విశాఖలో ఉన్నా. మదన్‌తో విడాకుల తర్వాత సుభాష్‌ను వివాహం చేసుకున్నా. అయినా మదన్ నన్ను హింసించారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత మదన్‌కు పిల్లలను చూపించా. డబ్బు కోసమే వేధిస్తున్నారు. రూ. 30 కోట్లు ఇవ్వాలని టార్చర్ చేశాడు. నేను ఎస్టీని కావడంతో ఇంతలా ఏడిపిస్తున్నారు.’’ అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.



Next Story