విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి.. కారణం ఏంటంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-02-17 06:12:02.0  )
విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి.. కారణం ఏంటంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: విశాఖపట్నం(Vishakhapatnam) సెంట్రల్ జైలు(Central Jail)లో ఓ ఖైదీ మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్న భూసరి రాజబాబు కేజీహెచ్‌లో(KGH) చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. గతేడాది నవంబర్‌లో ఏజెన్సీలోని కొయ్యూరు మండలం, బకులూరు సమీపంలో జరిగిన హత్య కేసులో రాజబాబు రెండో నిందితుడిగా ఉన్నారు.

ఈ క్రమంలో రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతని ఆరోగ్యం విషమించడంతో కేజీహెచ్‌కు తరలించారు. ఈ తరుణంలో చికిత్స పొందుతన్న రాజాబాబు నిన్న(ఆదివారం) ఉదయం మరణించాడు. ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం.. జైలు అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేజీహెచ్‌ ఆర్‌ఎంవో మెహర్‌కుమార్(Moharkumar) తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed