ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్

by Seetharam |
ద్వారంపూడి దోచుకున్నదంతా నయా పైసాతో సహా కక్కిస్తాం : మాజీ మంత్రి కే.ఎస్ జవహార్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న పెడిగ్రీని తిని ద్వారంపూడి లాంటి వారు మొరుగుతున్నారు అని మాజీమంత్రి కేఎస్ జవహర్ అన్నారు. లోకేశ్‌ వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట వైసీపీ పాలకుల గుండెల్లో తుపాకి తూటాల్లా దిగుతున్నాయి అని మండిపడ్డారు. ‘యువత భవిష్యత్తుకై ప్రజల మధ్యకు యువనేత వచ్చారు. యువగళం యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. అది చూసి ఓర్వలేని జగన్ రెడ్డి తన పెంపుడు ఎమ్మెల్యేలు, మంత్రులకు స్క్రిప్ట్ రాసి వాళ్ల చేత మొరిగిస్తున్నాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతకాక అప్పుల ఊబిలోకి నెట్టి చివరకు గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు’ అని ఆరోపించారు. కోడి కత్తి డ్రామాలు, గొడ్డలి వేట్లు, దొంగ దారుల్లో అధికారం దక్కించుకునే సంస్కారం వైసీపీలోనే ఉంది అని చెప్పుకొచ్చారు. నమ్మిన ప్రజలను మోసం చేయటం వైసీపీ నైజం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, ధర్మ మార్గంలో చట్ట సభలకు వెళ్తారు తప్ప.. దొడ్డి దారిన కాదు. వైసీపీ ఎంపీలు రాజ్యసభకు ఎలా వెళ్ళారు? అది కూడా దొడ్డి దారేనా? అని మండిపడ్డారు. వైసీపీ నేతలకు రాజ్యాంగమన్నా, చట్టాలన్నా లెక్కలేకుండా పోయింది. లోకేశ్ ఓడిపోయినా కృంగి పోలేదు.ప్రజల మధ్యనే ఉండి ప్రజానాయకుడిగా ఎదిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దిగజారుడు రాజకీయం మొదలు పెట్టారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఏం చేసినా ఈ సారి అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీనే అని ధ్వజమెత్తారు. వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది అని మండిపడ్డారు. వైసీపీ దుకాణం సర్దుకునే సమయం దగ్గర పడింది. ద్వారంపూడి లాంటి వారు దొడ్డి దారిన దారుణంగా సంపాదించి ఏ దొడ్డిలో ఎంత దాచిపెట్టారు అధికారంలోకి రాగానే బయటపెడతాం. తప్పకుండా వారిని శిక్షిస్తాం మాజీమంత్రి కేఎస్ జవహర్ అని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed