- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయాం’..ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు?
దిశ,వెబ్డెస్క్: ఏపీలో 2024 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నికల సమయంలో గెలుపు పై ధీమాతో ఉన్న వైసీపీ ఊహించని విధంగా కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో వైసీపీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన తప్పుల్ని సరిదిద్దుకోకపోవడం వల్లనే ఈ ఎన్నికల్లో ఓటర్లు మమ్మల్ని తిరస్కరించారని కరణం ధర్మశ్రీ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నా ఓటమికి బీఎన్ రహదారి గోతులే కారణం అని చెప్పారు. మేడివాడ దగ్గర రహదారులు గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఆ రహదారులను బాగు చేయించాలని కోరుతున్నానని తెలిపారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్కు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని ఫైరయ్యారు. దీని ఫలితంగానే భారీ ఓట్ల తేడాతో దారుణంగా ఓడిపోయా అని కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.