AP News:మాజీ వాలంటీర్లకు మంత్రి వార్నింగ్!

by Jakkula Mamatha |
AP News:మాజీ వాలంటీర్లకు మంత్రి వార్నింగ్!
X

దిశ ప్రతినిధి,విజయవాడ:ఏపీలో ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్లకు మంత్రి వీరాంజనేయ స్వామి వార్నింగ్ ఇచ్చారు. రాజీనామా చేసినా ఇంకా ఫోన్లు, సిమ్ కార్డులు తిరిగివ్వని వాలంటీర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి డీవీబీ స్వామి హెచ్చరించారు. ఇప్పటివరకు 1.09 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు. ‘చాలా గ్రామాల్లో గ్రామ, వార్డు సచివాలయ భవనాలు దూరంగా ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో లేనివాటిని గుర్తించి సమగ్ర నివేదిక అందించాలి. సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫొటోలు తొలగించాలి' అని ఆయన అధికారులను ఆదేశించారు.



Next Story