- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > ‘ఎవరికైనా కష్టమే’.. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు
‘ఎవరికైనా కష్టమే’.. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు
by Satheesh |
X
దిశ, వెబ్డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం నాకో లేక బీజేపీకో సంబంధించిన విషయం కాదని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే అంశం తెర మీదకు వచ్చిందని స్పష్టం చేశారు. ఈ ఏడాది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉందని వెల్లడించారు. విశాఖ ప్లాంట్ నష్టాలు పూడ్చాలంటే ఏ ప్రభుత్వానికైనా కష్టమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోవడంతోనే ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తోందని క్లారిటీ ఇచ్చారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి.
Advertisement
Next Story