Tirumala: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం.. టీటీడీ ఆగ్రహం

by srinivas |
Tirumala: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం.. టీటీడీ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది. లడ్డూ ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారని తెలిపారు. శ్రీవారి పోటులో 980 మంది హిందు కార్మికులు పని చేస్తున్నారని వెల్లడించింది. ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయొద్దని.. అలా చేస్తే చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరించింది.



Next Story