- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
విషాదంగా విహారయాత్ర: గోదావరిలో నలుగురు యువకుల గల్లంతు
దిశ, డైనమిక్ బ్యూరో : విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. నదిలో స్నానం చేసేందుకు సరదాగా దిగిన మిత్రుల్లో నలుగురు గల్లంతయ్యారు. దీంతో వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. ఈ షాకింగ్ ఘటన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీ గోపులంక పుష్కర ఘాట్ వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని సజ్జాపురం గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు యానాం వచ్చారు. అక్కడి నుంచి గోపులంక పుష్కర్ ఘాట్లో స్నానానికి వెళ్లారు. ఏడుగురు యువకులు కాసేపు సరదాగా గోదావరి నదిలో ఎంజాయ్ చేస్తూ లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోయారు. దీంతో వారిలో కొందరు కొబ్బరి మట్టల సాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. అయితే నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో తణుకు ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న తిరుమల రవితేజ, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి పెండ్యాల బాలాజీ, వాసవి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ముద్దన ఫణీంద్ర గణేష్లు ఉన్నారు. అంతేకాదు తణుకులో పాలిటెక్నిక్ చదువుతూ మధ్యలో మానేసిన కార్తీక్ సైతం వీరితో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గోపులంక పుష్కర ఘాట్ వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు.