తెల్లవారితే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం.. ఇంతలోనే దంపతుల దుర్మరణం

by srinivas |
తెల్లవారితే కొత్త ఇంట్లో గృహ ప్రవేశం.. ఇంతలోనే దంపతుల దుర్మరణం
X

దిశ, వెబ్ బెస్క్: ఎన్నో ఏళ కల. చాలా కష్టపడ్డారు. తెల్లవారితే కల సాకారం. ఇంతలోనే మృత్యువు కబలించింది. ఈ ఘటన అనంతరపురం జిల్లా హవలిగిలో జరిగింది. గ్రామానికి చెందిన మారెప్ప, లక్ష్మి ఇన్నో ఏళ్లుగా అద్దెకు ఉంటున్నారు. చాలా కష్టపడి కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. తెల్లవారితే గృహ ప్రవేశం చేయాలనుకున్నారు. కానీ భారీ వర్షం... మారెప్ప, లక్ష్మిని బలి తీసుకుంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిపై కప్పు కూలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న మారెప్ప, లక్ష్మి గాఢనిద్రలోనే దుర్మరణం పాలయ్యారు. వారి కుమార్తె, కుమారుడికి గాయాలయ్యాయి. బయట నిద్రపోతున్న మరో కుమారుడు సురక్షితంగా ఉన్నారు. ఒక్క రోజు గడిచి ఉంటే మారెప్ప, లక్ష్మి మృత్యువు నుంచి తప్పించుకునేవారని స్థానికులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఎన్నో ఏళ్లుగా తమకు కలిసి ఉన్న దంపతులు ఇక లేరని తెలిసి గ్రామస్తుల సైతం కంటతడిపెట్టుకున్నారు.



Next Story