తీవ్ర విషాదం: వాగులో పడిఅన్నదమ్ముల మృతి

by Seetharam |
తీవ్ర విషాదం: వాగులో పడిఅన్నదమ్ముల మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : దసరా సెలవులు కావడంతో అన్నదమ్ములు ఇద్దరూ ఆటలాడుకునేందుకు బయటకు వెళ్లారు. కొంచెం ఎండ ఎక్కువగా ఉండటంతో సరదాగా వాగులో దిగారు. అయితే ప్రమాదవశాత్తు వాగులో మునిగి అన్నదమ్ములు ఇద్దరూ దుర్మరణం చెందారు. కన్నబిడ్డలు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గోనెపూడిలో నెలకొంది. వివరాల్లోకి వెళ్తే గోనెపూడికి చెందిన వెలుగు చెంచయ్య, కోటేశ్వరమ్మలు జీవిస్తున్నారు. వీరి కుమారులు మణికంఠ(10), నవీన్ కుమార్(8). స్థానిక పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. దసరా సెలవులు కావడంతో పిల్లలు వాగులో స్నానం చేసేందుకు దిగి ప్రమాదవ శాత్తు దుర్మరణం చెందారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed