‘దీన్ని అంటారు సార్... Man Made Disaster అని’.. జగన్‌కు ఇచ్చిపడేసిన నాగబాబు

by Anjali |   ( Updated:2024-09-03 15:26:10.0  )
‘దీన్ని అంటారు సార్... Man Made Disaster అని’.. జగన్‌కు ఇచ్చిపడేసిన నాగబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ గురించి సోషల్ మీడియాలో మాస్ ట్వీట్ చేశారు. ‘కృష్ణానది వరదల విజిట్‌కు వచ్చి, వరదల్ని Man Made Disaster అని సెలవిచ్చారు. ఒకసారి క్రింద ఉంది చదవండి జగన్. మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది పశువులు చనిపోయాయి. ఎటుచూసినా కూలిన ఇళ్లు.. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం ఉన్నారు. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు.

అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పార్లమెంటులో అన్నారు. దీన్ని అంటారు సార్ Man Made Disaster అని. ఒకసారి మీరు first class student కాబట్టి Natural Disaster కు Man made Disaster కు తేడా తెల్సుకోవాల్సిందిగా కోరుతున్నాను.

మీరు డ్యాం గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వల్ల, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వల్ల జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని అంటారు Man Made Disaster అని గమనించగలరు జగన్. వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను’. అంటూ నాగబాబు రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed