వాళ్లతో మమ్మల్ని తిట్టిస్తున్నారు.. : చంద్రబాబు

by Rajesh |
వాళ్లతో మమ్మల్ని తిట్టిస్తున్నారు.. : చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: రజనీకాంత్ ఏదో అంటే ఆయనపై వైసీపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడటం ఏంటని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ తీరును ఖండించారు. మన్మోహన్ సింగ్, బిల్ క్లింటన్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని పొగిడారన్నారు. కాపులతో తనను, పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. మంచి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారని, రివర్స్ పాలనతో వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఫౌండేషన్ వేసిన కంపెనీలకు శంకుస్థాపన చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇలా చేస్తే ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి రారని చంద్రబాబు అన్నారు. పెట్టుబడుల్లో ఏపీ వెనక్కి వెళ్లిపోయిందన్నారు.

Next Story

Most Viewed