Breaking: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత

by srinivas |
Breaking: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ కట్టడాలపై శనివారం ఉదయం స్థానిక మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపించారు. సరైన పత్రాలు, అనుమతులు లేకుండా దన్నానపేటలో నిర్మించిన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో అక్రమంగా నిర్మించిన వైసీపీ నేత వెంకునాయుడు ఇంటిని సైతం జేసీబీలతో కూల్చివేశారు. ఈ ఘటనతో దన్నానపేటలో పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ నేతల ఆందోళన మధ్యే అక్రమ కట్టడాలను కూల్చివేశారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఫిర్యాదులతో తమ నాయకుల కట్టడాలపై అధికార యంత్రాంగం చర్యలకు దిగిందని మండిపడ్డారు. టీడీపీ నాయకుల అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed