‘గుడ్లవల్లేరు’లో కెమెరాలు, వీడియోలు లేవు..అది ముగ్గురి వివాదం..మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘గుడ్లవల్లేరు’లో కెమెరాలు, వీడియోలు లేవు..అది ముగ్గురి వివాదం..మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్:గుడ్లవల్లేరు కాలేజీలో లేడీస్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఘటన పై విద్యార్థినులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. తాజాగా ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ..గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు కనపడలేదని, వీడియోలు లేవని మంత్రి లోకేష్ చెప్పారు. ఓ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. అక్కడ ముగ్గురు నలుగురి మధ్య వివాదం ఉంది. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాం అని తెలిపారు. ఈ క్రమంలో ‘వీడియోలు ఉన్నాయని అమ్మాయిలు చెబుతున్నారు. మీడియాను లోపలికి ఎందుకు పంపలేదు’ అని జర్నలిస్టులు ప్రశ్నించగా పోలీసులు వెళ్లారు. అక్కడ ఎలాంటి వీడియోలు దొరకలేదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed