- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
‘ఆ రిజర్వాయర్కు కృష్ణా నీటిని విడుదల చేయండి’.. మంత్రి నిమ్మలను కోరిన ఎమ్మెల్యే
దిశ ప్రతినిధి, పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువు, మారాలా రిజర్వాయర్కు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా నీటిని విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కోరారు. ఆదివారం అనంతపురం విచ్చేసిన మంత్రిని ఆర్ అండ్ బీ లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి నియోజకవర్గంలో 195 చెరువులకు నీటిని అందించే ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంత్రికి విన్నవించారు. దీనికి మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పుట్టపర్తి నియోజకవర్గం లోని 195 చెరువులకు నీళ్లు ఇచ్చే విషయంలో ఎమ్మెల్యే కోరిన విధంగా నిధుల కేటాయింపుకు తప్పకుండా కృషి చేస్తానని రామానాయుడు హామీ ఇచ్చారు. అనంతరం తొలిసారి ఉమ్మడి అనంతపురం జిల్లాకు విచ్చేసిన మంత్రి నిమ్మల రామానాయుడుని వారు శాలువా కప్పి సన్మానించారు.