‘ఇలా చెప్పుకోవటానికి సిగ్గు కూడా వేయదా’.. జగన్‌పై టీడీపీ ఫైర్

by Anjali |   ( Updated:2024-09-02 08:43:48.0  )
‘ఇలా చెప్పుకోవటానికి సిగ్గు కూడా వేయదా’.. జగన్‌పై టీడీపీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ మరోసారి ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. జగన్ చేతకాని వాడు కదా ఇలాగే ఎవరో చేసిన పని తన పనిగా చెప్పుకుంటారంటూ విమర్శలు గుప్పించింది. ఊహా లోకంలో తాను బతుకుతూ, బులుగ గొర్రెలను ఉంచుతాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వేరే వాళ్ల పని ఆయన పని అని చెప్పుకోవటానికి జగన్‌కు కాస్తైనా సిగ్గు వేయదా? అని టీడీపీ మండిపడింది. విజయవాడ కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ కోసం 2014 ముందు నుంచి టీడీపీ పోరాడిందని పేర్కొంది. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.164 కోట్లతో 2.1 కిలో మీటర్ల మేర రక్షణ గోడ నిర్మాణం పూర్తి చేసిందని గర్వంగా చెప్పుకొచ్చింది. టీడీపీ 2019 ఆగస్టులో రీటైనింగ్ వాల్ మీద ఊరేగిన గుట్కా, బెట్టింగ్ ఫొటోలే సాక్ష్యమని వెల్లడించింది. ఆ దేవుడు జగన్‌కు సిగ్గు ఎట్లా పెట్టలేదు.. ఫేకు జగన్, సైకో జగన్’ అంటూ ప్రశ్నించింది.

Advertisement

Next Story