టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

by Y. Venkata Narasimha Reddy |
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో త్వరలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను ఖరారు చేశారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరా బత్తుల రాజశేఖర్ ను ప్రకటించారు. కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్న వైసీపీ ఇప్పటికే ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా సీనియర్ లీడర్ పొన్నూరు గౌతంరెడ్డి పేరును ఖరారు చేసింది.

వచ్చే ఏడాది మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణ రావు, పాకలపాటి రఘువర్మ, ఇళ్ల వెంకటేశ్వరరావుల పదవీ కాలం పదవీ కాలం ముగియ్యనుంది. దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed