అంతా చేసి.. ఇప్పుడు లేఖ రాస్తారా.. జగన్‌పై పట్టాభి ఫైర్

by srinivas |
అంతా చేసి.. ఇప్పుడు లేఖ రాస్తారా.. జగన్‌పై పట్టాభి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Issue)పై ప్రధాని మోడీ(Pm Modi)కి ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jangan Mohan Reddy) లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై టీడీపీ నేత పట్టాభిరామ్ (Tdp Leader Pattabhi Ram) స్పందించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్‌పై పట్టాభి విమర్శలు చేశారు. తప్పులు చేసి మోడీకి జగన్ లేఖ రాయడం విడ్డూరమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి హిందూ ద్రోహి అని విమర్శించారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో దారుణమైన పాపాలు చేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీవారి సన్నిధిలో చాలా తప్పులు జరిగాయని చెప్పారు. తప్పులు చేసింది గాక.. మీడియా ముందుకు వచ్చి క్యాజువల్‌గా మాట్లాడతారా అని పట్టాభి మండిపడ్డారు. జగన్ పాలనలో ఎన్నో ఆలయాలు నేలమట్టమయ్యాయని గుర్తు చేశారు. రథాలు తగలబెట్టారని, విగ్రహాలను ధ్వంసం చేశారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేసి ఇప్పుడు వాటిని కప్పి పుచ్చుకునేందుకు ప్రధాని మోడీకి లేఖ రాస్తారా అని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed