గేదెల మందులు అమ్మే సంస్థ సర్వే చేసిందా.. వైసీపీకి TDP అదిరిపోయే కౌంటర్

by Disha Web Desk 4 |
గేదెల మందులు అమ్మే సంస్థ సర్వే చేసిందా.. వైసీపీకి TDP అదిరిపోయే కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ పీక్స్‌కు చేరింది. రెండు పార్టీలు ఆయా పోస్టులపై కౌంటర్ ట్వీట్‌లు చేస్తున్నాయి. తాజాగా.. ఏపీలో వైసీపీ జెండా ఎగరబోతోంది అంటూ ఫ్యాన్ పార్టీ ట్వీట్ చేసింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ సర్వే నిర్వహించిందని ఈ సర్వేలో వైసీపీ 135 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు వస్తాయని ఉంది. ఎన్డీఏ కూటమికి 40 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు వస్తాయని సర్వే పేర్కొనగా ఆ రిపోర్ట్‌ను వైసీపీ ట్వీట్ చేసింది. దీనికి టీడీపీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ‘గేదెల పొదుగుకి మందులు అమ్మే కంపెనీ సర్వే చేసిందా..? ఇదేమి సర్వే రా బాబు మీ గన్నవరం గూట్లే చేశాడా? లేక మీ పార్టీ వాళ్లు మొత్తం బుర్రలేని గొర్రెలని ఐప్యాక్ వాడు సలహా ఇచ్చాడా?’ అని టీడీపీ ట్వీట్ చేసింది ఈ ట్వీట్‌కు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ యాడ్ ఫొటోను జత చేసింది.

Next Story

Most Viewed