స్కిల్ స్కాం కేసు: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్

by Seetharam |
ap highcourt
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈకేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేశ్‌ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నాం విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు తెలియజేసింది. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో కిలారు రాజేష్ పేరును సీఐడీ ప్రస్తావించింది. స్కిల్ స్కాంలో రాజేశ్ అత్యంత కీలకంగా వ్యవహరించారని ఆరోపించింది. రాజేశ్‌ను విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని భావించామని అయితే..రాజేష్ పరారీలో ఉన్నారని సీఐడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐడీ తెలిపింది. ఇంతలో ఏపీ హైకోర్టులో కిలారు రాజేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రాజేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story