సంక్షేమం పేరుతో పేదల సొమ్మును దోచుకున్న సర్కార్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

by Shiva |
సంక్షేమం పేరుతో పేదల సొమ్మును దోచుకున్న సర్కార్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్షేమం పేరుతో ప్రభుత్వం పేదల సొమ్మను దోచుకుంటోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపూ గళమెత్తిన ఏకైక పార్టీ బీజేపీయేనని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తించాలన్నారు. ఏపీలో కొంతమేరైనా అభివృద్ధి జరుగుతోందంటే అందుకు ప్రధాని మోడీయే కారణమని అన్నారు. ప్రతి బీజేపీ కార్యకర్త కూడా జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల చెంతకు తీసుకెళ్లాలని అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అన్నారు. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed