కేంద్రమంత్రి పదవిపై మనసులో మాట బయటపెట్టిన రామ్మోహన్ నాయుడు

by srinivas |
కేంద్రమంత్రి పదవిపై మనసులో మాట బయటపెట్టిన రామ్మోహన్ నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రంలో టీడీపీ, జనసేనకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రానికి స్పీకర్‌తో పాటు కేంద్రమంత్రులు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్రమంత్రి పదవి రాబోతోందని ప్రచారం జరుగుతుంది. చిన్న వయసులోనే ఎంపీగా మూడు సార్లు గెలిచినందున ఆయనకు ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు స్పందించారు. రూమర్లు వస్తున్నాయని, కాని వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని తేల్చిచెప్పారు. తాను వ్యక్తిగతంగా ఎలాంటి పదవులు కోరుకోనని, టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే నడుచుకుంటానని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేదే టీడీపీ లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం చాలా వెనుకబడిందని, ప్రస్తుతం అభివృద్ధి పథంలో నడిపేందుకు కేంద్రంతో కలిసి నడుస్తున్నామని తెలిపారు. కేంద్రంలో టీడీపీ ఒక బలమైన శక్తిగా ఉంటుందని.. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో ఎలా అయితే ఉమ్మడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామో.. ఇప్పుడు కూడా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.



Next Story