ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఫిక్స్

by Disha Web Desk 12 |
ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోడీ బీజేపీ తరఫున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో ఓటింగ్ జరగనుండగా.. ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఫిక్స్ అయింది. పొత్తులో భాగంగా బీజేపీకి వచ్చిన అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థుల తరఫున కూడా ప్రధాని మోడీ ఉమ్మడి సభలో పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 6, 8న ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననుండగా.. మొత్తం మూడు భారీ బహిరంగసభలు, ఒక రోడ్ షో కు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. అలాగే సాయంత్రం 6 గంటలకు అనకాపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మాట్లాడుతారు. దీంతో పాటుగా ఈ నెల 8న రాజంపేటలో బహిరంగ సభ, విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన ఖరారు కావడంతో ఏపీ బీజేపీ నేతలతో పాటు కూటమి నేతలు పెద్ద ఎత్తున సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed